పులి కడుపున పులే పుడుతుంది.. నేను వైఎస్ఆర్ రక్తం.. ఎవరు అవునన్నా కాదన్నా నేను వైఎస్ షర్మిల రెడ్డే.. విమర్శ చేయడం నా ఉద్దేశ్యం కానే కాదు.
YSR పాలనకు జగన్ అన్న పాలనకు చాలా వ్యత్యాసం ఉంది.YSR కి,జగన్ అన్నకు ఆకాశం,భూమికి ఉన్నంత తేడా ఉంది. వైఎస్ఆర్ జలయజ్ఞంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రాజెక్టులు జలమయం చేశారు. పోలవరం పనులు 32 శాతం పూర్తి చేశారు. ఆయన మరణం తర్వాత ప్రాజెక్ట్ పక్కన పడేసారు. ఆ తర్వాత చంద్రబాబు వచ్చినా,జగన్ అన్న వచ్చినా ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు. ఇక ప్రత్యేక హోదా పై బాబు,జగన్ అన్న మాట్లాడలేదు.బీజేపీతో దోస్తీ కోసం బాబు,జగన్ అన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు. హోదా గురించి రాగం తీసి ,నిరాహార దీక్షలు చేసిన వాళ్ళు ఇప్పుడు బీజేపీ కి బానిసలుగా మారారు. హోదా కాదు కదా… కనీసం ప్రత్యేక ప్యాకేజీ కూడా లేదు.రాష్ట్రం అభివృద్ది చెందాలి అంటే వీళ్ళతో కాదు .. రాష్ట్రంలో ,కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. పోలవరం పూర్తి చేయాలి అంటే కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం
1 thought on “పులి కడుపున పులే పుడుతుంది .. నేను YSR రక్తం.. ఎవరు అవునన్నా కాదన్నా నేను YS షర్మిలా రెడ్డే..”