LIVE FM

11/10/2024

Latest Online Breaking News

మోడీ హయాంలో రైల్వే స్టేషన్లు విమానాశ్రయాల్లా అభివృద్ధి చెందుతున్నాయు: ఈటల రాజేందర్.

Spread the love

జై శ్రీరాం బువ్వ పెడుతుందా అని కేసీఆర్ మాట్లాడారు..
జై శ్రీరామ అన్నం పెడుతుందా.. ఆపదలో ఆదుకుంటుందా ప్రజలు చూసుకుంటారు.

నరేంద్ర మోడీ హయాంలో రైల్వే స్టేషన్లు విమానాశ్రయాల్లా అభివృద్ధి చెందుతున్నాయు.

హైదరాబాద్ లో భూములు అమ్మకుండా రుణమాఫీ చేస్తే నేను కూడా రాజకీయాలనుండి తప్పుకుంటా అని ఛాలెంజ్ చేస్తున్న.

మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం దమ్మాయిగూడ మున్సిపాలిటీలలో ఈటల రాజేందర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ హైదరాబాద్ లో భూములు అమ్మకుండా రుణమాఫీ చేస్తే నేనుకూడా రాజకీయాల నుండి తప్పుకుంటా అని ఛాలెంజ్ చేశారు . జై శ్రీరాం బువ్వ పెడుతుందా అని కేసీఆర్ నిన్న మాట్లాడారు.. జై శ్రీరామ అన్నం పెడుతుందా.. ఆపదలో ఆదుకుంటుందా ప్రజలు చూసుకుంటారు అని పేర్కొన్నారు. మోదీ ఏంది గీడీ ఏంది  అన్న కేసీఆర్ పరిస్థితి ఏంటో చూస్తున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అలాగే మాట్లాడుతున్నారు అని అన్నారు. మోదీ హయాంలో రైల్వే స్టేషన్లు విమానాశ్రయాల్లా అభివృద్ధి చెందుతున్నాయు.
మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చాడు… ఒక్క ఆర్టీసీ ఫ్రీ బస్ తప్ప ఇంకే పథకం అమలుకావడం లేదు.. మీకు ఎవరికైనా కొత్త పెన్షన్లు వచ్చాయా ?వికలాంగులకు 6000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు ఇచ్చాడా ?నా ఆడబిడ్డలకి 2500 రూపాయలు  ఇస్తా అన్నాడు ఇచ్చాడా?
కళ్యాణ్ లక్ష్మి పేరుతో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పిండు.. ఎవరికైనా వచ్చిందా ? అని ప్రశ్నించారు.చదువుకునే ఆడపిల్లలకి స్కూటీ ఇస్తా అని చెప్పిండు, ఆటో డ్రైవర్లకు 12000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఏది ఇవ్వలేదు. ఇప్పుడు కేసీఆర్ నాకు ఉత్తచిప్ప చేతికి ఇచ్చాడు అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చి 17 సీట్లు గెలిపించండి హామీలు అమలు చేస్తా అంటున్నారు. వారు గెలిచేది లేదు మాట నిలబెట్టుకునేది లేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, బండారు విజయలక్ష్మి, సుదర్శన్ రెడ్డి, మల్లారెడ్డి, వెంకటరమణ, నందారెడ్డి, పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

0
0
,
,