ఎల్కతుర్తి మండలంలోని జిల్గుల గ్రామంలో బుధవారం రోజున కేంద్ర పత్తి పరిశోధన సంస్థ కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట, రాశి పత్తి విత్తన సంస్థ వారి ఆధ్వర్యంలో అధిక సాంద్రత పద్ధతిలో సాగుపై క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించారు. ఈ పద్ధతిలో సాగు చేసినప్పుడు వరుసలు మొక్కల మధ్య దూరం తక్కువగా ఉండటం వల్ల మొక్కల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మొక్కకు 8-12 కాయలు ఉండి ఎక్కువ మొక్కలు ఉండడం వల్ల అధికంగా దిగుబడి వస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కె.వి.కె యంగ్ ప్రొఫెషనల్ ఆర్ రాజేష్, పి రాజేష్,ఎం విష్ణు, రాశి కంపెనీ సీడ్స్ జిల్లా ప్రతినిధి రమణారెడ్డి, ప్రవీణ్ కుమార్, హరీష్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.
More Stories
బతుకమ్మ పండుగ వేడుకల్లో విషాదం.. విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి.. సీసీ కెమెరాల దృశ్యాలు..
రోడ్డు ను ఆక్రమించి ఇల్లు నిర్మాణాలు.. పట్టించుకోని అధికారులు.. ఆగ్రహం వ్యక్తం చేసిన కాలనీవాసులు…
విస్ డమ్ జూనియర్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు..