LIVE FM

11/10/2024

Latest Online Breaking News

కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు ప్రయోజనం

Spread the love

 

అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం

హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి వొడితల ప్రణవ్ బాబు

హుజూరాబాద్ :తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధి వొడితల ప్రణవ్ అన్నారు. సింగాపూర్ గ్రామంలోని వొడితల ప్రణవ్ నివాసంలో ఆదివారం సాయంత్రం వీణవంక మండల అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో మామిడాలపల్లి, మల్లారెడ్డిపల్లి గ్రామాల నుంచి 100 మంది. సోమవారం హుజూరాబాద్ మండల అధ్యక్షులు కొల్లూరి కిరణ్ ఆధ్వర్యంలో పోతిరెడ్డిపేటకు చెందిన కంకణాల శ్రీనివాస్ తో పాటు 50 మంది. రంగాపూర్ కు చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్ కుంట తిరుపతి రెడ్డితో పాటు 30 మంది, పట్టణ మహిళా అధ్యక్షురాలు యేముల పుష్పలత ఆధ్వర్యంలో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన సుమారు 100 మంది మహిళలు. తుమ్మనపల్లికి చెందిన 30 మంది యువకులు, హుజూరాబాద్ బీఆర్ఎస్ వై జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ మార్కెట్ డైరెక్టర్ మహమ్మద్ ఖలీద్ హుస్సేన్, 15వ వార్డు బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఉప్పు శ్రీనివాస్, 2వ వార్డుకు చెందిన ఎస్కె జలీల్, కేసిఆర్ సేవాదళ్ పట్టణ శాఖ అధ్యక్షులు ఉప్పులపల్లి చంద్రశేఖర్, మున్నూరుకాపు జిల్లా నాయకులు రావులు రాజేష్, ఇల్లందకుంట మండల అధ్యక్షులు రామారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మొలుగూరి సదయ్య, యూత్ కాంగ్రెస్ గంగారపు మహేష్ ఆధ్వర్యంలో 50 మంది బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన నాయకులు, వీణవంక మండలం కనపర్తి గ్రామ అధ్యక్షులు ఆలేటి శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో యూత్ అధ్యక్షుడు ప్రసాద్, సీనియర్ నాయకులు పత్తి సమ్మిరెడ్డిలతో పాటు 50 మంది కార్యకర్తలు, కమలాపూర్ మండలం మర్రిపెల్లిగూడెం మాజీ ఉపసర్పంచ్ గట్టు శ్రీధర్ పాటు 20 మంది కార్యకర్తలు, కమలాపూర్ 20 మంది, కానిపర్తి గ్రామం నుంచి 20 మంది శ్రీకాంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరగా వీరికి వొడితల ప్రణవ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వనించారు. కాంగ్రెస్ పార్టీపై అభిమానం, నమ్మకంతో వస్తున్న నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ…రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేసిఆర్ అవినీతి పాలన నడుస్తోందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని, మంచి పాలన కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు వంద శాతం కట్టుబడి పని చెస్తుందన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో సొంత ఖర్చులతో ప్రతి మండలానికి స్టడీ సెంటర్. గ్రంధాలయాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మహిళలు, యువకులు, ఓటర్లు ఆలోచించి మీ బిడ్డగా నిండు మనసుతో దీవించి హస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

0
0
,
,